ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీడీ కాలనీ ద్వారకానగర్కు చెందిన పెద్ది బోయిన సుబ్బారావు, అప్పుల బాధ తట్టుకోలేక బుధవారం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. కొంతకాలంగా రొటేషన్ వ్యాపారం నిర్వహిస్తూ అప్పులు పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.