ఏలూరు జిల్లా కార్యాలయంలో ఈనెల 2వ తేదీన (సోమవారం) నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు పట్టణంలో గంగానమ్మ జాతర మహోత్సవం సందర్భంగా ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ ఆంక్షలు తదితర కారణాల దృష్ట్యా పీజీఆర్ఎస్ను రద్దు చేశామన్నారు. ప్రజలందరూ గమనించాలన్నారు.