ఏలూరు పడమరవీధి గంగమ్మ తల్లి జాతర సందర్భంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శనివారం అడిషనల్ SP అడ్మిన్ సూర్యచంద్రరావు పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ మార్గదర్శకాలను వివరించారు. సుమారు 1200 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని, వృద్ధులు, మహిళలు, పిల్లలకు ప్రత్యేక సహాయం అందించాలని, వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల్లో నిలపాలని సూచించారు.