ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం మోటార్ సైకిల్ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఏలూరు, కృష్ణా జిల్లాకు చెందిన శ్రీమన్నారాయణ (32), నవీన్ (30)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.