ముదినేపల్లి మండలం కొత్తపేటకు చెందిన వృద్ధురాలు కోటేశ్వరమ్మ, ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో నిర్మించిన ఇంటి నుంచి తన చిన్న కుమారుడు, కోడలు తమను బయటకు గెంటేశారని ఆరోపిస్తూ, తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం నివాసం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమకు ఆశ్రయం కల్పించి ఆదుకోవాలని ఆమె అధికారులను వేడుకున్నారు.