ఏలూరు నగరంలోని పడమర వీధిలో శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఆదివారం తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారి మేడల వద్ద మహా కుంభాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. భక్తులు క్యూ లైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.