కలిదిండి మండలం మట్టగుంటలో మంగళవారం జరిగిన సమావేశంలో అండ్రాజు శ్రీనివాసరావు హైదరాబాద్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించారు. మీడియాపై దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, తెలంగాణ ప్రభుత్వం ఈ దాడులను సీరియస్గా తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు అసహ్యకరమని, ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.