ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గురువారం పెనుమంట్ర, వెలగలవారిపాలెం గ్రామాలలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత్
భారత్–గ్రామీణ ఉపాధి, జీవనోపాధి హామీ (వీబీ-గ్రామ్-జీ) కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని ఆయన తెలిపారు.