నూజివీడులోని కొన్నంగుంటలో ఆరేపల్లి దేవి (35) అనే మహిళ ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఈ ఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.