పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం బైన పాలెం గ్రామంలో కొలువైయున్న శ్రీశ్రీశ్రీ గంగాలమ్మ అమ్మవారికి ఆదివారం కమిటీ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి అలంకరణ అనంతరం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కమిటీ వారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.