బుట్టాయిగూడెం: నీట మునిగిన గుబ్బల మంగమ్మ ఆలయం

1536చూసినవారు
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని కొరసవారిగూడెం అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ గుబ్బల మంగమ్మ ఆలయం భారీ వర్షాల కారణంగా నీట మునిగింది. ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న కుండపోత వర్షాలకు కొండ వాగులు పొంగి ప్రవహించడంతో అమ్మవారి ఆలయం పై నుండి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీనితో పాటు, అమ్మవారి ఆలయానికి వెళ్లే రహదారులు కూడా వరద తాకిడికి మూసుకుపోయాయి.

సంబంధిత పోస్ట్