పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంగళవారం రెడ్డి గణపవరం సమీపంలోని R&R కాలనీ కోండ్రుకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఆసుపత్రిలోని వైద్య సేవలు, మందుల నిల్వలు, రోగులకు అందుతున్న చికిత్స, సిబ్బంది హాజరు, పరిశుభ్రత వంటి అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఏలూరు, పోలవరం ప్రాంతాల్లో ఈ సంఘటన జరిగింది.