2026 జనవరి 30న తాడేపల్లిగూడెం (రూరల్) ఎంపిడిఓ కార్యాలయంలో మండల స్థాయి శిక్షణా శిబిరం జరిగింది. జిల్లా ఆసుపత్రి తణుకుకు చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ ఎన్.వి.ఆర్.కృష్ణా రెడ్డి చిన్నారులపై లైంగిక వేధింపుల రూపాలు, వాటి ప్రమాద కారకాలు, హెచ్చరిక సంకేతాలు, నివారణ చర్యలను వివరించారు. మండల విద్యాశాఖాధికారులు నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, మహిళా పోలీసులు, ఐసీడీసీ సిబ్బంది పాల్గొన్నారు.