పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్లో ప్రిన్సిపాల్ అశోక్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్, విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ పర్యవేక్షణలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు ఈ క్యాంప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో సిమెంట్ రోడ్డు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించినందుకు విద్యార్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ హిరా బట్టు, అధ్యాపకులు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.