తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని డా. బీ. ఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ రాజారావు మంగళవారం తెలిపారు. 5, 6, 10వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 19వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.