భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రాష్ట్ర నూతన కమిటీలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరికి కీలక పదవులు దక్కాయి. జిల్లా ఉపాధ్యక్షురాలిగా మాజీ మంత్రి దివంగత పైడికొండల మాణిక్యాలరావు కుమార్తె సింధు, కార్యదర్శిగా బాల వినాయక వరప్రసాద్ నియమితులయ్యారు. రాష్ట్ర కమిటీలో జిల్లాకు రెండు పదవులు లభించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ, నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.