సోమవారం వై. రవికుమార్ పెంటపాడు తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన సునీల్ కుమార్ తాడేపల్లిగూడెం బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో రవికుమార్ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ సమయాభావం లేకుండా పూర్తి చేస్తానని రవికుమార్ తెలిపారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.