పశ్చిమ గోదావరి జిల్లా ఉండి బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీరామక్షేత్రంలో శనివారం నూతన శిఖర పునః ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. 72 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయ శిఖరం శిథిలావస్థకు చేరుకోవడంతో, దానిని పునః ప్రతిష్టించారు. ఈ సందర్భంగా స్వామి వారికి చక్రస్థానం, మహా పూర్ణాహుతి నిర్వహించారు.