ఉండి మండలం పాందువ్వకు చెందిన వీధి నవీన్ కుమార్ మృతిపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ కలహాలతోనే అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. వాస్తవాలను వక్రీకరించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.