పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో, గృహ, జనగణన డేటా సేకరణపై ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు రెండు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం పరిశీలించారు. దేశ చరిత్రలో తొలిసారిగా గృహ గణన ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణలో పాల్గొన్న వారికి ఆయన పలు సూచనలు చేశారు.