బుధవారం ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 11,000 నగదు, మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆకస్మిక దాడిలో ద్వారకా తిరుమల ఎస్ఐ తన పోలీస్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు.