ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు తన క్యాంపు కార్యాలయంలో ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వెంటనే పరిష్కరించాలని, పంచాయతీ బడ్జెట్కు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.