వైసీపీ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీవీ ఛానల్ యజమానిని తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ వైసీపీ శ్రేణులు చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. గురువారం ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన తెలిపారు. అనంతరం చేబ్రోలు ఎస్ఐ సూర్యభగవాన్కు ఫిర్యాదు పత్రాలు అందజేశారు.