ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పోలంపల్లి పీఎస్ పరిధిలోని అడవిలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కమాండర్ ముచాకే కైలాశ్ మృతి చెందాడు. ఇతనిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. కాగా ఇతను మందుపాతరల అమరికలో నిపుణుడు. ముచాకే హత్య కేసులు కూడా ఉన్నాయి. మరోవైపు, కాంకేర్ జిల్లాలో ముగ్గురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారు రెండు ఎస్ఎల్ఆర్లు, ఒక 303 రైఫిల్ను పోలీసులకు అప్పగించారు.