దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన యూత్ఫుల్ సోషల్ డ్రామా ‘యుఫోరియా’ ఏప్రిల్ 2 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 6న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ఉషా కిరణ్ మూవీస్తోనే ప్రారంభమైందని, రామోజీ రావు తనకు ఇన్స్పిరేషన్గా నిలిచారని, ఆ సంస్థ తనకు మంచి పునాది వేసిందని, ఇప్పుడు ‘యుఫోరియా’ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కావడం గర్వంగా ఉందని అన్నారు.