కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఉన్న నంజున్గఢ్ జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నంజుండేశ్వర ఆలయం ఉంది. ఇక్కడి శివుడిని శ్రీకంఠీశ్వరుడు అని పిలుస్తారు. ఆలయ శిలాఫలకాల ప్రకారం, గౌతమ మహర్షి ఈ శివలింగాన్ని ప్రతిష్టించారు. 'నంజ' అంటే విషం, 'నంజుంద' అంటే విషాన్ని స్వీకరించినవాడు అని కన్నడ అర్థం. సాగర మధనం సమయంలో వెలువడిన విషాన్ని శివుడు తాగి, గొంతులోనే నిల్వ చేసుకోవడంతో ఆయన కంఠం నీలంగా మారి, నీలకంఠేశ్వరుడిగా పిలుస్తారు. ఈ ఆలయంలో శివుడిని దర్శించుకుంటే ఎలాంటి రోగాలైనా నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఇలాంటి మరెన్నో ఆలయ విశేషాలను ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోండి.