ప్రియదర్శి, నాగ దుర్గ నటిస్తున్న 'ఇడుపు కాయితం' సినిమా పేరు వివాదాస్పదమైంది. ఈ వివాదం రాజకీయ మలుపు తీసుకుంది. సినిమా పేరు అర్థం తెలియనివారు పవన్ కళ్యాణ్ను అడగాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీనిపై జనసైనికులు మండిపడుతున్నారు.
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, 'చిప్పకూడు' అర్థం చెప్పాలని కవితను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తెలంగాణ మాండలికాన్ని అవమానించవద్దని కొందరు పోస్టులకు కౌంటర్లు ఇవ్వడంతో ఈ వ్యవహారం సోషల్ మీడియా వార్గా మారింది.