AP: మంత్రి సత్యకుమార్ పేరుతో నకిలీ టీటీడీ లెటర్ల జారీపై విజయవాడ నగర కమిషనర్కు ఫిర్యాదు అందింది. గత కొద్దిరోజులుగా మంత్రి పేరుతో నకిలీ టీటీడీ లెటర్లు జారీ చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు కమిషనర్కు సోమవారం మంత్రి సత్యకుమార్ పీఏ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు చెప్పారు. టీటీడీ ఫేక్ లెటర్లు ఇచ్చే వారి విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు.