ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి ఆధార్ విధానంలో ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ కార్డులో కుటుంబ సభ్యులకు అవసరమైన సంక్షేమ పథకాలు, లబ్ధి వివరాలు, ఇతర అవసరాలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. ఉమ్మడి కుటుంబాలు విడిపోవాల్సిన అవసరం లేదని, అవసరమైతే పథకాల్లో మార్పులు చేస్తామని సీఎం తెలిపారు. ఈ విధానం పారదర్శకతను పెంచి, ప్రజలకు వేగవంతమైన సహాయం అందించేలా రూపొందిస్తున్నారు.