కర్ణాటకలోని బాగల్కోట్లో భూసేకరణ పరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగిపోయిన రైతు బసప్ప దొడమణి.. శనివారం టౌన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ఒక అధికారిపై చెప్పుతో దాడి చేశాడు. ఈ ఘటనతో కార్యాలయంలో కలకలం రేగింది. కొందరు అధికారులు భయంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.