సిద్దిపేట జిల్లా దుద్దెడలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మతిస్థిమితం లేని మహిళ రోడ్డుకు అడ్డంగా రావడంతో ఆమెను తప్పించబోయిన క్రమంలో కారు ఇంట్లోకి దూసుకెళ్లినట్లు సమాచారం. మృతులు రాధవ్వ, లక్ష్మీ, చిన్నారి సహస్రగా గుర్తించారు.