AP: కోనసీమ జిల్లా ఆలమూరులో ఇద్దరు కుమారులను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య బంధువుల వేధింపులు తాళలేక చిలకలపాడు గ్రామానికి చెందిన కామరాజు (36) తన పిల్లలు అభిరామ్ (11), త్రినాథ్ గౌతమ్ (8)లకు పురుగుమందు తాగించి, తాను ఉరేసుకున్నాడు. 2020లో భార్య నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె కుటుంబం వేధింపులు పెంచిందని, తన చావుకు ముగ్గురు కారణమని కామరాజు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు.