పుణే యువకుడు కేతన్ను లోయలోకి తోసి చంపిన కేసులో నిందితురాలిపై నేరారోపణకు తగిన ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సియాకు లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి కోరారు. పాలీగ్రాఫ్ పరీక్ష ద్వారా దర్యాప్తులో పురోగతి సాధించవచ్చని పోలీసులు వాదించారు. అయితే, పాలీగ్రాఫ్ పరీక్ష నివేదికలను కోర్టులు సాక్ష్యాలుగా పరిగణించవని గమనించాలని కోర్టు తెలిపింది. ఇక కేతన్ను, ఆమె ప్రియుడు చేతన్ కలిసి లోయలోకి తోసి చంపారని ఆరోపణలున్నాయి.