దేశ ఆర్థిక గమనానికి దిశానిర్దేశం చేసే కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 (ఆదివారం) ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ వార్షిక పద్దును నిర్మలమ్మ రికార్డు స్థాయిలో 9వ సారి ప్రవేశపెడుతుండటం విశేషం. దేశ ప్రజలంతా ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.