AP: గత ప్రభుత్వంతో పోలిస్తే ఏపీకి 6 రెట్లు పెరిగిన విదేశీ పెట్టుబడులు వచ్చాయని కేంద్రం తెలిపింది. ఏపీకి విదేశీ పెట్టుబడులు పెరిగినట్లు లోక్సభలో లెక్కలతో సహా కేంద్రం వివరించింది.
వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి 92.13 మిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు, 2024-25 నాటికి 233.14 మిలియన్ డాలర్లకు ఎఫ్డీఐలు, 2025-26 నాటికి ఏకంగా 608.59 మిలియన్ డాలర్లకు ఎఫ్డీఐలు పెరిగినట్లు వెల్లడించింది.