పశ్చిమ బెంగాల్లోని బరైపూర్లో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ..
బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బాధిత కుటుంబానికి మద్దతుగా ఆమె క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. దుండగులు బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, ఆపై హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశారు. పోస్ట్మార్టం నివేదికలో బాలిక ప్రైవేట్ భాగాలలో గాయాలు, ఒంటిపై కొరికిన గుర్తులు, తలకు తీవ్ర గాయాలైనట్లు వెల్లడైంది.