AP: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వురూలో బుధవారం
వైసీపీ రిలే దీక్షలు చేపట్టింది. మంత్రి నారా
లోకేశ్ డీఎస్సీ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు నిర్వహించారు. మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ దీక్షల్లో పాల్గొని సంఘీభావం తెలిపారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ దీక్షలకు నాయకత్వం వహిస్తున్నారు.