AP: ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రాజకీయ వారసత్వంపై చర్చ జరుగుతోంది. ఆయన కుమార్తె, వైద్యురాలు డాక్టర్ బొత్స అనూష రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపుతున్నాయి.