కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ (94) బుధవారం కన్నుమూశారు. కిద్వాయ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో, జాతీయ స్థాయిలోనూ తనదైన ముద్ర వేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కిద్వాయ్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణం
కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.