AP: గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గం మాజీ
వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్లను నూజివీడు పోలీసులు గుజరాత్లో అరెస్టు చేశారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ముస్తఫా కుమారుడు ఒక వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేసి హింసించిన కేసులో ఈ అరెస్టులు జరిగాయి. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న ముస్తఫాను పోలీసులు గుజరాత్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.