ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విశాఖలో 'పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్' నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏ సంస్థకైనా స్పష్టమైన లక్ష్యమే నిజమైన పునాది అని అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి
లోకేశ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ క్రీడా ప్రాజెక్ట్ రూపకల్పనలో తనకు అండగా నిలిచిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ను రూపొందించినట్లు ఆమె తెలిపారు.