అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘గ్రేట్ ఇమిగ్రెంట్స్’ జాబితాలో నలుగురు భారతీయ అమెరికన్లకు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల నుంచి వచ్చి అమెరికాలో పౌరసత్వం పొందిన 25 మందిని ఈ ఏడాది అగ్రరాజ్యం గొప్ప వలసదారులుగా గుర్తించింది. వీరిలో భారత మూలాలున్న హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ డా.సంజీవ్ చోప్రా, వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ ప్రెసిడింట్ రేష్మ కెవల్రామణి, పాలో ఆల్టో నెట్వర్క్స్ ఛైర్మన్ని నికేష్ అరోరా, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సామాజిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మహరీన్ బనాజీ ఉన్నారు.