AP: విశాఖపట్నంలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగుచూసింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఆశ చూపి రూ.6.5 కోట్లకుపైగా వసూలు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో దంపతులతో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెట్టుబడిదారులను మోసం చేసి, వారి డబ్బును కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.