AP: రాష్ట్రవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడినట్లు పెట్రోల్ బంక్స్ అసోసియేషన్ నేత గోపాలకృష్ణ తెలిపారు. గతవారం ఆయిల్ కంపెనీలు తక్కువ సప్లై చేయడమే దీనికి కారణమని, ముఖ్యంగా డీజిల్ కొరత ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని, అనవసరంగా పానిక్ బయింగ్ చేయవద్దని వినియోగదారులకు సూచించారు. ఇంధన కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం ఆయిల్ డీలర్లకు ఆదేశాలు జారీ చేసిందని కూడా ఆయన వెల్లడించారు.