తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఫిర్యాదుతో, ఏపీలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) కేసు నమోదు చేసింది. ఇంధన కొరత వల్ల అత్యవసర సేవలు, రవాణాకు అంతరాయం కలుగుతోందని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.