AP: కూటమి ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి విద్యార్థుల కోసం భారీగా నిధులు విడుదల చేసింది. 'సర్వేపల్లి రాధా కృష్ణన్ విద్యార్థి మిత్ర' పేరుతో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే వారికి నోట్బుక్లు, డిక్షనరీలు, యూనిఫాం క్లాత్లు వంటివి అందించనున్నారు. మొత్తం రూ. 830.04 కోట్ల నిధులతో, టెండర్ల ద్వారా నాణ్యమైన వస్తువుల సేకరణ, పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.