మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు

8563చూసినవారు
మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది. దేశంలో వ్యూహాత్మక ఎల్పీజీ నిల్వలను పెంచే ప్రణాళికలో భాగంగా, కిలోకు రూ.1.29 అదనపు రుసుము విధించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమలైతే సాధారణ 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర సుమారు రూ.18 వరకు పెరగొచ్చు. అలాగే సీఎన్‌జీపై కూడా అదనపు రుసుము విధించే అంశం పరిశీలనలో ఉంది. అయితే ఈ ప్రతిపాదనకు ఇంకా కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించలేదు. అధికారిక నిర్ణయం వెలువడిన తర్వాతే కొత్త ధరలపై స్పష్టత రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్