AP: తిరుపతి జిల్లా శెట్టిపల్లెలో దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ సమస్యకు సొల్యూషన్ లభించింది. పేద కుటుంబాలకు న్యాయం చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. శెట్టిపల్లెలో దశాబ్దాలుగా ఉన్న అన్సెటిల్డ్ ఎస్టేట్ భూ సమస్యను పరిష్కరించడం ద్వారా 2,111 పేద కుటుంబాలకు న్యాయం చేయనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ కుటుంబాలకు పట్టాలు అందజేస్తామని మంత్రి అనగాని ప్రకటించారు.