ఉల్లి రైతులకు కేంద్రం ఊరట కలిగించింది. ఉల్లి కొనుగోలు ధర క్వింటాల్కు 13 శాతం పెంచింది. బఫర్ స్టాక్ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కొనుగోలు ధర రూ.2,125కు చేరింది. గతంలో మద్దతు ధర క్వింటాల్కు రూ.1,875గా ఉంది. కాగా ఈ సీజన్లో కేంద్రం ధరలు పెంచడం ఇది ఐదోసారి.