AP: రేషన్ కార్డుదారుల శుభవార్త. ఇకపై నిత్యావసరాలు రోజుకు 12 గంటల పాటు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కొత్త విధానాన్ని ముందుగా తిరుపతి, రాజమండ్రి, విశాఖ, GNTR, విజయవాడ నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఈ మార్పులో భాగంగా, తిరుపతిలోని కొన్ని రేషన్ దుకాణాలను 'మినీ మాల్స్'గా మార్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పరిమిత సమయానికే తెరిచి ఉండే రేషన్ దుకాణాలు, మినీ మాల్స్గా మారితే రోజంతా సేవలు అందించే అవకాశం ఉంది.